ఏపీలో ఎన్నికల కౌంటింగ్( Election Counting) కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది.ఈ మేరకు అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు.కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే పోలింగ్ ఏజెంట్లతో పాటు ప్రజాప్రతినిధులకు కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఎంట్రన్స్ ను ఏర్పాటు చేశారు.కాగా రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుందన్న సంగతి తెలిసిందే.