ఏపీలోని విపక్ష కూటమిపై మాజీ మంత్రి పేర్ని నాని( Perni Nani ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.2014లో ప్రజలను మోసం చేసి టీడీపీ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు.
వైసీపీ నవరత్నాలను కాపీ కొట్టి సూపర్ సిక్స్ ( TDP Super Six )అంటున్నారని పేర్ని నాని ఆరోపించారు.జగన్ అంటే ఒక నమ్మకమన్న ఆయన జగన్ పై ప్రజలకు నమ్మకం ఉందని చెప్పారు.
అదేవిధంగా ప్రజలపై జగన్( CM YS jagan ) కు నమ్మకం ఉందని పేర్కొన్నారు.పేదల పట్ల సానుకూల దృక్పథం ఉన్న నేత జగన్ అని తెలిపారు.
ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీకే పట్టం కడతారని పేర్ని నాని ధీమా వ్యక్తం చేశారు.