ఏపీలో జరగబోయే ఎన్నికల్లో జనసేన 20 స్థానాలలో పోటీ చేయనుంది.టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో జనసేన సులువుగా కనీసం 20 స్థానాలలో విజయం సాధిస్తుందని పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
అయితే ఎన్నికల్లో విజయం సాధించాలంటే పవన్ కళ్యాణ్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని తన బలాన్ని పవన్ మరవొద్దంటూ ఆయన శ్రేయోభిలాషులు సూచిస్తున్నారు.
ఎన్నికల్లో జనసేన( Janasena ) పోటీ చేసే 5 స్థానాలకు సంబంధించి ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.
అయితే మిగతా స్థానాలను సైతం పవన్ వేగంగా ప్రకటిస్తే బాగుంటుందని అదే సమయంలో పవన్ ఎక్కడినుంచి పోటీ చేస్తారో క్లారిటీ ఇస్తే బాగుంటుందని పవన్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే నేతలకు బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది.

2024 ఎన్నికలు జనసేనకు ఎంతో కీలకమనే సంగతి తెలిసిందే.గెలవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని పవన్ వదులుకోకూడదంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు చేస్తున్నారు.ఈ ఎన్నికల్లో ప్రతి ఓటూ ముఖ్యమేనని పవన్ కళ్యాణ్ ప్రచారం విషయంలో వేగం పెంచాల్సిన అవసరం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తిరుపతి నుంచి కూడా జనసేన పోటీ చేయనుందని తాజాగా స్పష్టత వచ్చేసింది.

ప్రజల్లో మంచి గుర్తింపు నేతలకు పవన్ కళ్యాణ్ టికెట్లు ఇస్తే జనసేన పార్టీకి గెలుపు నల్లేరు మీద నడక అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పోటీ చేసే స్థానాలకు సంబంధించి స్పష్టత ఇవ్వాల్సి ఉంది.పవన్ ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.పవన్ కళ్యాణ్ 2014 మ్యాజిక్ ను 2024 ఎన్నికల్లో సైతం రిపీట్ చేస్తారని నెటిజన్లు ఫీలవుతున్నారు.
ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది.