నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు డిఎస్పీలను బదిలీ చేస్తూ డిజిపి రవిగుప్త బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఒకే పార్లమెంటు పరిధిలో గత నాలుగేళ్లలో మూడు సంవత్సరాల పాటు పని చేసిన వారిని బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున బదిలీలను చేపట్టారు.
ఇటీవల ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం గతవారం రోజుల్లో మూడుసార్లు డీఎస్పీలను బదిలీ చేశారు.