పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకీ రీఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’ ఈపాటికి రిలీజ్ కావాల్సింది.కానీ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో మరింత ఆలస్యం అవుతూ వచ్చింది.
ఇక షూటింగ్ చివరిదశకు చేరుకుని మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా లాక్డౌన్ రూపంలో ఈ సినిమాకు పెద్ద అడ్డంకి వచ్చి పడింది.దీంతో ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యి రిలీజ్ డేట్ కూడా వెనక్కి వెళ్లిపోయింది.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమా బాలీవుడ్లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్గా వస్తోంది.ఇక లాక్డౌన్లో పలు సడలింపులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా సినిమా షూటింగ్లు కూడా నిర్వహించేందుకు అనుమతినిచ్చింది.
అయితే కొంతమంది సభ్యులతో మాత్రమే జరుపుకోవాలని, సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వ అధికారులు సూచించారు.దీంతో వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ను వెంటనే మొదలుపెట్టి సినిమాను ముగించేయాలని పవన్ అండ్ టీమ్ చూస్తోంది.
కాగా కరోనా వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుని, అతి తక్కువ మందితో షూటింగ్ నిర్వహించాలని చిత్ర ప్రొడ్యూసర్ దిల్ రాజు భావిస్తున్నాడు.వీలైనంత త్వరగా సినిమాను ముగించేస్తే, ఆ తరువాత రిలీజ్ విషయం గురించి ఆలోచించవచ్చని వకీల్ సాబ్ చిత్ర యూనిట్ అంటోంది.
పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రంలో నివేదా థామస్, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.