తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి జయం సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు నితిన్.మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న నితిన్ అనంతరం పలు సినిమా అవకాశాలను అందుకుని ఇండస్ట్రీలో హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఈయన సినీ కెరీర్లో హిట్ అండ్ ఫ్లాప్ లు అధికంగా ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో విపరీతంగా ఆదరణ పొందిన హీరో నితిన్ అని చెప్పాలి.ఇకపోతే ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా నితిన్ ఇంస్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ… 20 సంవత్సరాల క్రితం జయం సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించాను.ఇప్పుడు ఏం చెప్పాలో మాటలు కూడా రావడం లేదు.
నన్ను నమ్మి నాకు జయం సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు తేజ గారికి కృతజ్ఞతలు.అదేవిధంగా నా రెండు దశాబ్దాల కాలంలో నాతో పాటు పనిచేసిన దర్శకనిర్మాతలు ఇతర నటీనటులు టెక్నీషియన్లకు,ముఖ్యంగా 20 సంవత్సరాల నుంచి నన్ను ఆదరిస్తూ నాపై ఇంత ప్రేమకురిపిస్తున్న అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఇకపోతే భీష్మ సినిమా ఎంతో మంచి హిట్ అందుకున్న నితిన్ ఆ తర్వాత నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి.ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా చేయగా మాచర్ల నియోజకవర్గం అనే మరో సినిమాని కూడా చేస్తున్నారు.ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ పనులతో బిజీగా ఉన్నాయి.ఈ సినిమాలపై నితిన్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.