నాగ్ అశ్విన్ఒకప్పుడు అందరిలాగానే ఒక సాదాసీదా డైరెక్టర్ గా కొనసాగే వాడు.కానీ మహానటి సినిమా తర్వాత మాత్రం నాగ్ అశ్విన్ అందరిలోనూ ప్రత్యేకమైన దర్శకుడిగా మారిపోయాడు.
తీసింది తక్కువ చిత్రాలే అయినా అతడు సినిమా తీస్తే బాగుంటుంది అబ్బా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది అని ప్రేక్షకులు భావించే ఈ విధంగా తన సినిమాలతో ప్రభావితం చేసాడు నాగ్ అశ్విన్.ఇక ఎన్నో భావోద్వేగాలకు పెద్ద పీట వేస్తూ వైవిధ్య భరితమైన కథనే సినిమాలుగా తీస్తు ప్రేక్షకులను పలకరిస్తున్నాడు అశ్విన్.
ఇక దర్శకుడిగా నాగ్ అశ్విన్ కి తెలుగు చిత్ర పరిశ్రమలో 7 ఏళ్ల ప్రస్థానం పూర్తయింది.ఇక ఈ 7 ఏళ్లలో నాగ్ అశ్విన్ చేసింది కొన్ని సినిమాలు మాత్రమే.
కానీ సంపాదించుకున్న పేరు మాత్రం ఎప్పటికీ తరగనిది అని చెప్పాలి2015 లో ఎవడే సుబ్రహ్మణ్యం ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగ్ అశ్విన్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.ఇదే నాగ్ అశ్విన్కు మొదటి సినిమా.
ఇక రెండు నంది అవార్డులు కూడా ఈ సినిమా సంపాదించింది.ఇక ఆ తర్వాత మహానటి సావిత్రి జీవిత ఆధారంగా రూపొందిన మహానటి సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్గా లాభాలు కూడా తెచ్చిపెట్టింది.
తెలుగునాట అందరి చూపు బయోపిక్ లపై వచ్చేలా చేసింది.
ఇక ఈ సినిమా అటు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ను స్టార్ చేయడమే కాదు ఇక ఈ సినిమాలో ప్రధానపాత్రలో మహానటి గా చేసిన కేరళ కుట్టి కీర్తి సురేష్ ను కూడా స్టార్ హీరోయిన్ గా చేసింది.ఇక ఏకంగా జాతీయ అవార్డును సైతం అందించింది.ఈ సినిమా ఎన్నో విభాగాల్లో జాతీయ పురస్కారాలను అందుకుంది అన్న విషయం తెలిసిందే.
ఇక నెట్ఫ్లిక్స్ ఓటిటి వేదికగా నాగ అశ్విన్ నిర్మించినపిట్టకథలు అనే ఒక ఆంకాలజీ ప్రాజెక్టుతో కూడా ప్రేక్షకులను అలరించబోతున్నారు.అయితే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి ప్రాజెక్టు కె అనే భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నారు నాగ్ అశ్విన్.ఇందులో అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండగా ప్రభాస్ సరసన దీపికా పదుకునే నటిస్తోంది.వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందు సందడి చేయబోతుంది ఈ సినిమా.ఇక నాగ్ అశ్విన్ 7 ఏళ్ల కెరీర్ పూర్తిచేసుకున్న సందర్భంగా ఇక అతను భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన సినిమాలతో అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు
.