టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్బాబు, సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ మురుగదాస్ల కాంబినేషన్లో ఒక చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే.తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఆ చిత్రం వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటి వరకు దాదాపు తన ప్రతి చిత్రంలో కూడా సమాజానికి ఉపయోగపడే విషయాన్ని, ప్రేక్షకులను ఆలోచింపజేసే విషయాన్ని చూపించిన దర్శకుడు మురుగదాస్ త్వరలో మహేష్బాబుతో కూడా అదే తరహా సినిమాను తెరకెక్కించేందుకు కథను సిద్దం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం న్యాయ వ్యవస్థపై పోరాడే పాత్రలో మహేష్బాబును మురుగదాస్ చూపించనున్నట్లుగా తెలుస్తోంది.
భారత దేశంలో న్యాయ వ్యవస్థలో పలు లోపాలున్నాయి.ఆ లోపాల వల్ల ఎంతో మంది తప్పు చేసిన వారు తప్పించుకుంటున్నారు.
ఆ లోపాలను ఎత్తి చూపుతూ, వాటికి పరిష్కార మార్గాలను చూపించేదిగా ఈ చిత్రం ఉంటుందని సమాచారం అందుతోంది.తెలుగులో మహేష్బాబు హీరోగా నటిస్తున్న ఇదే కథలో తమిళంలో విజయ్ హీరోగా నటించనున్నట్లుగా తెలుస్తోంది.
వచ్చే సంవత్సరంలో మహేష్బాబు, మురుగదాస్ల కాంబినేషన్లో చిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.