సాధారణంగా పదివేలు పెడితే బెస్ట్ ఇయర్ఫోన్స్, హెడ్ఫోన్లు దొరుకుతాయి.మధ్య తరగతి వారు ఇంతకంటే ఎక్కువ రేటు పెట్టలేరు.
కానీ ధనవంతులు మాత్రం ఎంత డబ్బు అయినా ఖర్చు చేస్తారు.అలాంటి వారి కోసం లక్షల రూపాయల ఖరీదైన హెడ్ఫోన్స్ ( Headphones ) కూడా కంపెనీలు లాంచ్ చేస్తున్నాయి.
వీటిని చెవిలో పెట్టుకుంటే చాలు మ్యూజిక్లో లీనం అయిపోవచ్చు.సరిగ్గా అలాంటి అనుభూతే అందించేందుకు జేబీఎల్ (JBL) తన టూర్ వన్ M2 వైర్లెస్ హెడ్ఫోన్ను( Tour One M2 ) విడుదల చేసింది.
ఇది సోనీ, సెన్హైజర్ వంటి దిగ్గజ బ్రాండ్లతో పోటీ పడే ఒక హై-ఎండ్ ప్రొడక్ట్.
ఇక ఈ సరికొత్త టూర్ వన్ M2 హెడ్ఫోన్స్లో అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, నాలుగు బిల్ట్-ఇన్ మైక్లు, 40మిమీ డైనమిక్ డ్రైవర్లు, రబ్బరైజ్డ్ మెటీరియల్స్తో చేసిన కేబుల్స్ ఉన్నాయి.హై-రెస్ లెజెండరీ ప్రో సౌండ్ అవుట్పుట్ను అందించే ఈ హెడ్ ఫోన్స్ ద్వారా అద్భుతమైన అనుభూతిని ఆస్వాదించొచ్చు.ఈ ప్రొడక్ట్ బాడీ కార్బన్ ఫైబర్తో తయారు చేశారు కాబట్టి ఇది తేలికగా ఉంటుంది.
హెడ్ఫోన్ బరువు కేవలం 268 గ్రాములు ఉంటుంది.
ఈ హెడ్ఫోన్స్ ఆండ్రాయిడ్, విండోస్, ఐఓఎస్ డివైజ్లతో కనెక్ట్ అవుతాయి.గూగుల్ అసిస్టెంట్, అలెక్సా వంటి వాయిస్ అసిస్టెంట్లకు మద్దతు ఇస్తాయి.కొత్త హెడ్ఫోన్స్ 920mAh బ్యాటరీతో వస్తాయి.
యూఎస్బీ C పోర్ట్ ద్వారా ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు.లిమిటెడ్ టైమ్ ఆఫర్ కింద ఈ హెడ్ఫోన్ల ధరను రూ.24,999గా కంపెనీ నిర్ణయించింది.ఆ తర్వాత వాటి ధర రూ.34,999కి పెరుగుతుంది.ఈ ధర చూసి చాలామంది ముక్కున వేలేసుకుంటున్నారు.