టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం..: ఎమ్మెల్యే ఎంఎస్ బాబు

ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను చేసిన తప్పు ఏంటో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

 Injustice To Dalits In The Matter Of Tickets: Mla Ms Babu-TeluguStop.com

మంత్రులు, పార్టీ పెద్దలు చెప్పినట్లే పని చేశానని పేర్కొన్నారు.

అయితే తన పనితీరు బాగోలేదని, సర్వే నెగిటివ్ గా ఉందంటున్నారని ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అన్నారు.

పనితీరు బాలేనప్పుడు ఐదేళ్లుగా ఎప్పుడైనా పిలిచి మాట్లాడారా అని ప్రశ్నించారు.దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న చోటే మార్పులు చేస్తున్నారన్న ఆయన టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం జరుగుతోందని చెప్పారు.

జగన్ చెప్పిందే చేశానన్న ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఇప్పుడు తన తప్పంటే ఎలా అని మండిపడ్డారు.వైసీపీపై నమ్మకం ఉందని, పార్టీని వీడే ప్రసక్తే లేదని తెలిపారు.

మంత్రి పెద్దిరెడ్డి తనకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube