ఆసియా కప్( Asia Cup ) టోర్నీలో భాగంగా నేడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్( India Vs Pakistan ) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్. 266 పరుగులకు ఆల్ అవుట్ అయింది.48.5 ఓవర్ లలో పాకిస్తాన్ బౌలర్లు భారత ఆటగాలను ఆల్ అవుట్ చేయడం జరిగింది.ఈ మ్యాచ్ లో తొలుత ప్రారంభంలోనే ఇండియా టీంకి చెందిన మెయిన్ బ్యాట్స్ మ్యాన్ లు అవుట్ అయిపోయారు.
కనీసం 100 పరుగులు దాటకుండానే నాలుగు వికెట్లు పడిపోయాయి.
ఇలాంటి క్లిష్ట సమయంలో భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్.
( Ishan Kishan ) వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా( Hardik Pandya ) కలసి ఐదో వికెట్ కు 138 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు.ఇషాన్ కిషన్(82), హార్దిక్ పాండ్యా (87) పరుగులు చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే రెండో బ్యాటింగ్ కి పాకిస్తాన్ దిగాల్సిన సమయంలో నిరంతరంగా వర్షం పడటంతో.ఈ మ్యాచ్ ను ఎంపైర్లు రద్దు చేశారు.
భారత ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత వర్షం మొదలు కావడంతో పాటు నిరంతరంగా వర్షం పడుతూ ఉండటంతో.తగ్గకపోవడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఫీల్డ్ ఎంపైర్లు ప్రకటించారు.
దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది.