వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్ లో ఆస్ట్రేలియా( Australia ) చేతిలో భారత్( India ) ఘోరంగా ఓడిపోయింది.టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్ లలో 240 పరుగులు చేసి ఆల్ అవుట్ కావడం జరిగింది.
అనంతరం రెండో బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా 43 ఓవర్ లలో ఆరు వికెట్ల తేడాతో 241 పరుగులు చేసి విజయం సాదించింది.ఆస్ట్రేలియా బ్యాట్స్ మ్యాన్ లలో హెడ్ 137 పరుగులు( Travis Head ) చేసి మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్.భారత్ ఓడిపోవడంతో ప్రేక్షకులు ఎంతగానో నిరాశ చెందారు.
భారత్ ఆటగాళ్లు సైతం కన్నీరు పెట్టుకున్నారు.ఈ టోర్నీలో మొదటి నుంచి భారత్ ఒక ఓటమి లేకుండా రాణించింది.కానీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో.ఓడిపోవడం జరిగింది.ఆల్రెడీ లీగ్ దశలో ఆస్ట్రేలియాని భారత్ ఓడించడంతో.ఫైనల్ కూడా గెలుస్తారని అందరూ భావించారు.
కానీ అనూహ్యంగా ఫైనల్ మ్యాచ్ లో( Final Revenge ) ఆస్ట్రేలియా పుంజుకుని గెలవడం జరిగింది.ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా అద్భుతమైన ఫీల్డింగ్ చేయడం జరిగింది.
ఇదే సమయంలో భారత్ ఎక్స్ ట్రా పరుగులు ఇవ్వడం జరిగింది.దీంతో భారీ మూల్యం చెల్లించుకుని భారత్ వరల్డ్ కప్( World Cup ) గెలవలేకపోయింది.