టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించిన భారత్..!

తాజాగా ఆదివారం తిరువనంతపురం వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.భారత టాపార్డర్ బ్యాటర్లైన యశస్వి జైస్వాల్ 53 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 58 పరుగులు, ఇషాన్ కిషన్ 52 పరుగులతో రాణించడం వల్ల భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 235 పరుగులను నమోదు చేసింది.

 India Has Created A New History In The History Of T20 Cricket..! , India, T20-TeluguStop.com

అయితే టీ20 క్రికెట్ చరిత్రలో మొదటిసారి భారత జట్టు టాప్ ఆర్డర్ లో ముగ్గురు బ్యాటర్లు 50+ స్కోర్ సాధించడం విశేషం.గతంలో ఎంతోమంది సీనియర్లు సాధించలేని ఘనతను యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్( Ruturaj Gaikwad ), ఇషాన్ కిషన్ సాధించారు.

అంతేకాకుండా పవర్ ప్లేయర్ లో భారత జట్టు 77/1 పరుగులు సాధించింది.దీంతో టీ20 క్రికెట్ లో పవర్ ప్లేలో ఆస్ట్రేలియాపై భారత జట్టు చేసిన అత్యధిక స్కోర్ ఇదే.గతంలో 2016లో సాధించిన 74/1 రికార్డును భారత్ బ్రేక్ చేసింది.

భారత్ పొట్టి క్రికెట్ లో పాకిస్తాన్ పై( Pakistan ) ఉన్న రికార్డును సమం చేసింది.టీ20ల్లో పాకిస్తాన్ 226 మ్యాచ్ లలో 135 విజయాలు సాధించగా.భారత్ టీ20ల్లో 211 మ్యాచ్ లలో 135 విజయాలు సాధించి పాక్ రికార్డును సమం చేసింది.టీ20 క్రికెట్లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు మాత్రమే 100 విజయాల మార్క్ ను అందుకున్నాయి.న్యూజిలాండ్ జట్టు 171 మ్యాచ్లలో 95 విజయాలు సాధించింది.

ఆస్ట్రేలియా జట్టు 179 మ్యాచ్లలో 94 విజయాలు సాధించింది.ఇంగ్లాండ్ జట్టు 177 మ్యాచ్లలో 92 విజయాలు సాధించింది.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.భారత జట్టు 44 పరుగుల తేడాతో విజయం సాధించి, ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ లో 2-0 ఆధిక్యంలో ఉంది.భారత జట్టు దూకుడు చూస్తుంటే ఈ సిరీస్ కైవసం చేసుకుని ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకొనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube