రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి:సుంకరి

సూర్యాపేట జిల్లా:యాసంగిలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి అనేక కారణాలతో వరి పంట పండకుండా కోయటానికి వీలులేకుండా పూర్తిగా నష్టపోయిన రైతులను రెవెన్యూ అధికారులు గుర్తించి,ఆదుకోవాలని సామాజిక కార్యకర్త,మాజీ సర్పంచ్ సుంకర క్రాంతికుమార్ ప్రభుత్వాన్ని అధికారులను కోరారు.బుధవారం నేరేడుచర్ల మండలంలోని బక్కయ్యగూడెం,మేడారం,పెంచికల్ దీన్నే,కమలానగర్ లలో పంటను కోయకుండా పూర్తిగా వదిలివేసి నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలించారు.

 Government Should Support Farmers: Sunkari-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ యాసంగి పంటలో కొంతమంది రైతులు పర్యావరణ కారణాలతో పంట నష్టం జరిగి 20 బస్తాల దిగుబడి వచ్చి రైతులు,కౌలు రైతులు తీవ్రనష్టాలు చవిచూడగా ప్రస్తుత రబీలో పంటకోత కూళ్లు కూడా రావని వదిలేసిన పంటలతో తీవ్రంగా నష్టపోయారని,అలాంటి రైతులను వెంటనే గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించి,రైతులను ఆదుకోవాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube