తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలతో పెద్ద ఎత్తున హాట్ హాట్ గా మారుతున్న పరిస్థితి ఉంది.అయితే బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారాలనే ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తూ క్షేత్ర స్థాయిలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెంచేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే బీజేపీ మొదటి నుండి టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ క్రమక్రమంగా బలపడుతూ వచ్చే ఎన్నికల్లో గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలను సాధించేందుకు ఇప్పటికే భారీ కార్యాచరణ రూపొందించిన పరిస్థితి ఉంది.అయితే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీకి మధ్య భీకర పోరాటం జరిగే అవకాశం ఉంది.
అయితే కెసీఆర్ ఇప్పటికే ఎన్నికల సమయంలో ఎదురయ్యే రాజకీయ వాతావరణంపై ఇప్పటికే ఒక స్పష్టమైన క్లారిటీతో ఉన్న తరుణంలో చాలా చాకచక్యంగా సంచలన స్టేట్ మెంట్స్ తో ప్రతిపక్షాలను పూర్తిగా డైవర్ట్ చేసిన పరిస్థితి ఉంది.
దీంతో కెసీఆర్ తాను అనుకున్నట్టుగా ప్రతిపక్షాలను తమ వ్యూహంలో పడేసి వచ్చే ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిచేందుకు పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది.
అయితే ఇక బీజేపీ కూడా తగ్గేదే లే అన్నట్లుగా టీఆర్ఎస్ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలలో బీజేపీ దృష్టి సారిస్తూ ఆయా నియోజకవర్గాలలో ఎక్కువగా గెలిచే అవకాశాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఎంత వరకు విజయావకాశాలను మెరుగుపరుచుకుంటుందనేది ఇప్పుడే మనం స్పష్టంగా చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో రాజకీయ పరిస్థితులను బట్టి మనకు కాస్త అవగాహన వచ్చే అవకాశం ఉంది.
అయితే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోరులో గెలుపెవరిది అనే మాట ప్రక్కకు పెడితే గత రెండు దఫాలుగా జరిగిన ఎన్నికల వాతావరణం కంటే ఈసారి కాస్త రణరంగంగా ఉండే అవకాశం ఉంది.