ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించనున్నామని, ఇందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, మీడియా ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి కోరారు.శుక్రవారం ఎన్నికల సంఘం ఎన్నికల జ్ గెజిట్ నోటిఫికేషన్ జారీ తో వేములవాడ , సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాలలో నామినేషన్ ల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌తో కలిసి కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం లతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

 Everyone Should Cooperate To Conduct Transparent Elections In A Peaceful Environ-TeluguStop.com

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ….ఈ నెల 3 న నామినేషన్ ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమయ్యిందన్నారు.

ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.13న నామినేషన్ల స్ర్కూటినీ చేస్తారు.15వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పిస్తారన్నారు.అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.15 రోజులపాటు అభ్యర్థుల ప్రచారాల తర్వాత 30న పోలింగ్‌ నిర్వహిస్తారు.డిసెంబరు 3న ఓట్ల లెక్కింపును చేపట్టి లెక్కింపు పూర్తికాగానే గెలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారనీ జిల్లా కలెక్టర్ తెలిపారు.

నామినేషన్ల స్వీకరణ కోసం సిరిసిల్ల , వేములవాడ నియోజకవర్గ కేంద్రాల్లో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందన్నారు.రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయంలో నామినేషన్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను, నామినేషన్‌ పత్రాలు అందించే కౌంటర్లను, సెక్యూరిటీ డిపాజిట్‌ కౌంటర్లను, కంట్రోల్‌ రూంలను, హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసిందన్నారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు.

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు వారి నామినేషన్‌ పత్రాలను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుందన్నారు.

సువిధ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ అప్లికేషన్‌ సక్సెస్‌ అయిన తర్వాత వచ్చే పత్రాలపై అభ్యర్థి స్వయంగా సంతకం చేసి కాపీలను రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుందన్నారు.నామినేషన్‌ దాఖలు చేయడానికి ఒకరోజు ముందే అభ్యర్థి తన పేరున ఎన్నికల ఖర్చు కోసం కొత్తగా బ్యాంకు ఖాతాను ప్రారంభించి ఖాతాకు సంబంధించిన వివరాలను ఆర్‌వో కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుందన్నారు.

నామినేషన్‌ వేసే గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలకు చెందిన అభ్యర్థులు ఒక ప్రతిపాదకుడిని, ఇండిపెండెంట్లు, రిజిస్టర్‌ పార్టీలకు చెందిన అభ్యర్థులు పదిమంది ప్రతిపాదకుల సంతకాలను సమర్పించాల్సి ఉంటుందన్నారు.ప్రతిపాదకులందరు సంబంధిత నియోజకవర్గానికి చెందిన ఓటర్లయి ఉండాలన్నారు.

ప్రతిపాదకులు నిరక్షరాస్యులైన పక్షంలో ఆర్‌వో సమక్షంలోనే వేలిముద్ర వేయాల్సి ఉంటుందన్నారు.రిజర్వుడ్‌ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు నామినేషన్‌తోపాటు కుల ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

ధ్రువపత్రాలు అందుబాటులో లేకుంటే స్ర్కూటీని సమయానికి ఆర్వో కార్యాలయంలో వాటిని అందజేయాలనారు.జనరల్‌ అభ్యర్థులు 10 వేల రూపాయలు, ఎస్సీ అభ్యర్థులు 5 వేల రూపాయలు చెక్‌, చలానా రూపంలో సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలన్నారు.

నామినేషన్లు వేసే అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ సూచనలు

ఈ నెల 3 వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ స్వీకరణ.ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు నామినేషన్ స్వీకరణ.

నామినేషన్ దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు అభ్యర్థి వెంట నలుగురికి అనుమతి.నామినేషన్ పత్రాలతో పాటు ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసులు, విద్యా అర్హత వివరాలు పత్రాలను దాఖలు చేయాలి.

నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి దాఖలుకు ఒకరోజు ముందు కొత్త బ్యాంక్ అకౌంట్ చేసి ఈసీ కి వెల్లడించాలి.కొత్త బ్యాంక్ అకౌంట్ లోనే అభ్యర్థి ఖర్చు వివరాలను తెలపాలి.

సువిధా యాప్ ద్వారా నామినేషన్ దాఖలు సదుపాయం కల్పించిన ఎన్నికల సంఘం – ఆన్లైన్ లో దాఖలు తరువాత పత్రాలను ఆర్ ఓ కు అప్పగించాలి.

ప్రతిరోజు సాయంత్రం 3 గంటల తరువాత రోజువారీ నామినేషన్ వివరాలు వెల్లడించనున్న ఆర్ ఓ.ప్రతిరోజు నామినేషన్ పత్రాలతో పాటు అఫిడేవిట్ పత్రాలను డిస్ప్లే చేయనున్న ఆర్ ఓ -నామినేషన్ దాఖలు చేసిన ప్రతి అభ్యర్థి అఫిడవిట్ పత్రాలను 24గంటల్లోనే సీఈఓ వెబ్సైట్ లో పెట్టనున్న ఎన్నికల అధికారులు.అభ్యర్థులు అవసరమైతే 15వ తేదీ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.

నామినేషన్ కేంద్రాలలోకి 3 వాహనాలు.అభ్యర్థితో సహా ఐదుగురికే అనుమతి.రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోపు ఒక్కో అభ్యర్థికి సంబంధించిన 3 వాహనాలను మ అనుమతిస్తారు.

పటిష్ట బందోబస్తు, ఎక్కడికక్కడ నిఘా

ఎన్నికల్లో ఓటర్లను డబ్బులు, మద్యం, ఇతర కానుకలతో ప్రలోభపెట్టేందుకు జరిగే ప్రయత్నాలను అడ్డుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఎన్నికల కోడ్ను పటిష్టంగా అమలు చేసేందుకు జిల్లాలో వీడియో నిఘా బృందాలు, వీడియో వ్యూయింగ్ టీమ్ లు, అకౌంటింగ్ బృందాలు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వెలియన్స్ లో ↑ ఖర్చుల పర్యవేక్షణ బృందాలు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి చెప్పారు.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ…అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి మద్యం,నగదు ప్రలోబపరిచే వస్తువులు సరఫరా కాకుండా జిల్లా సరిహద్దుల్లో 07 చెక్ పోస్ట్,05 డైనమిక్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, అట్టి చెక్ పోస్ట్ ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేయడం జరుగుతుంది అన్నారు.

సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 3 వ తేదీ నుండి నామినేషన్ల పక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సిరిసిల్ల , వేములవాడ నామినేషన్ల కేంద్రాల వద్ద 100 సిబ్బందితో భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రెండు బిఎస్ఎఫ్ కంపెనీల 200 మంది సాయుధ బలగాలు రాగా త్వరలో మరో 4 కంపెనీల సాయుధ బలగాలు రావడం జరుగుతుంది అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube