హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి వద్ద ఎంపీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.దాడికి బీజేపీనే కారణమని ఆరోపిస్తూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అయితే ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ఆస్పత్రిలో శస్త్రచికిత్స కొనసాగుతోందని సమాచారం.కాగా ఎన్నికల ప్రచారంలో ఉండగా రాజు అనే వ్యక్తి ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో గజ్వేల్ లో ప్రాథమిక చికిత్స అనంతరం యశోద ఆస్పత్రికి తరలించారు.