ఏపీలోని అధికార పార్టీ వైసీపీలో మార్పుల పరంపర కొనసాగుతుంది.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ లను వైసీపీ అధిష్టానం మార్చిన సంగతి తెలిసిందే.
తాజాగా ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి గోదావరి జిల్లాలో ఇంఛార్జ్ ల మార్పులపై కీలక ప్రకటన చేయనుంది.కాగా ఈ జిల్లాలపై ఇంఛార్జ్ ల మార్పుపై పార్టీ హైకమాండ్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేయగా పలువురు వైసీపీ ఇంఛార్జ్ లకు స్థానచలనం కలిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 60 స్థానాల్లో ఇంఛార్జ్ లను మార్చాలని సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.