ఏ బంధు పెట్టినా బీఆర్ఎస్ పార్టీకేనా...?

యాదాద్రి భువనగిరి జిల్లా:ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల్లో జరగాలని,అప్పుడే అర్హులైన పేదలకు న్యాయం జరుగుతుందనిమోత్కూర్ మండలం( Mothkur ) పాలడుగు గ్రామ సర్పంచ్ మరిపల్లి యాదయ్య అన్నారు.సోమవారం గ్రామంలో ప్రభుత్వ పథకాల అమలులో అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ బహుజనులంతా రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు.

 Brs Party No Matter What Brother Is Put...?-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏ బంధు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ( BRS PARTY )నాయకులకు,కార్యకర్తలకుఇవ్వడమేంటని ప్రశ్నించారు.అర్హులైన దళితులకు దళిత బంధు, బీసీలకు బీసీ బంధు( BC Bandhu ), పేదలకు గృహలక్ష్మి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కానీ,స్థానిక బీఆర్ఎస్ నేతలు( BRS PARTY ) కేవలంతమ పార్టీకి చెందిన వారికే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రామ సభకు సంబంధం లేకుండా బీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో అర్హుల జాబితాను సిద్ధం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గూదే మధు, శేఖర్,గణేష్,పూలమ్మ, ధనలక్షి,పద్మ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube