బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్7( Boss show season ) ముగిసి చాలా రోజులు అవుతున్నా ఈ షో గురించి, ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ల గురించి చర్చ జరుగుతోంది.పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో సీజన్7 విజేతగా నిలవగా అమర్ దీప్ రన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న శివాజీ అమర్ దీప్ గురించి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రశాంత్, యావర్( Prince Yawar ) విషయంలో నేను స్టాండ్ తీసుకున్న చాలా సందర్భాల్లో ఇబ్బంది పడ్డానని శివాజీ అన్నారు.ప్రశాంత్ కెప్టెన్ బ్యాడ్జ్ ను లాగేసుకున్నారని ప్రశాంత్ హౌస్ ను సరిగ్గా హ్యాండిల్ చేయడం లేదని అందరూ ఓట్లేయడంతో అతని బ్యాడ్జ్ ను లాగేసుకున్నారని శివాజీ వెల్లడించారు.ఆ సమయంలో ఒక కామన్ మ్యాన్ కెప్టెన్ అయితే సెలబ్రిటీలకు నచ్చట్లేదా అని అనిపించిందని ఆయన కామెంట్లు చేశారు.
హౌస్ లో కొంతమంది యావర్ తో గొడవలు పెట్టుకోవడంతో ఆ సమయంలో కోపం వచ్చిందని శివాజీ అన్నారు.ఫైనల్ గా ఒకరిని కొట్టాలని అనుకున్న సందర్భం వచ్చిందని బిగ్ బాస్ హౌస్ లో ప్రశాంత్ ను కొందరు మానసికంగా టార్చర్ చేశారని ఆయన కామెంట్లు చేశారు.ఆ సమయంలో ప్రశాంత్ ను అమర్ దీప్ రెచ్చగొడుతున్నాడని శివాజీ వెల్లడించారు.14వ వారంలో అమర్, ప్రశాంత్ మధ్య గొడవ జరుగుతోందని ఆయన తెలిపారు.ప్రశాంత్ భుజంపై చెయ్యి వేసి అమర్ దీప్ తోసుకుంటూ వెళ్లిన సమయంలో నాలో కోపం కట్టలు తెంచుకుందని శివాజీ( Shivaji ) కామెంట్లు చేశారు.ఆ సమయంలో రక్తం మరిగిపోయిందని అగ్రిమెంట్ లో సంతకం చేయడంతో నేనేం చేయలేకపోయానని శివాజీ వెల్లడించారు.
శివాజీ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.