తెలంగాణ కాంగ్రెస్ బీసీ మరియు ఓబీసీ నేతలు హస్తిన బాట పడుతున్నారు.ఈ మేరకు ఢిల్లీ వెళ్తున్న నాయకులు రేపు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్నారని తెలుస్తోంది.
అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో కూడా బీసీ, ఓబీసీ నేతలు భేటీ అవుతారని సమాచారం.రాష్ట్రంలో బీసీ నేతలకు టికెట్ల కేటాయింపు అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
అయితే ఎమ్మెల్యే టికెట్ల కోసం అర్హత ఉన్న ఓబీసీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడంపై టీపీసీసీ అలసత్వం ప్రదర్శిస్తోందని తెలుస్తోంది.అదేవిధంగా బీసీలకు కూడా 34 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో జనాభా ప్రాతిపదికన తమకు కనీసం 45 సీట్లు కేటాయించాలని ఓబీసీ నేతలు పార్టీ హైకమాండ్ ను అడిగే అవకాశం ఉందని సమాచారం.