మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.ఈ ఇద్దరు హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద చాలా సందర్భాల్లో పోటీ పడ్డాయి.
గతేడాది సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి( Veera Simha Reddy ) సినిమాలు విడుదల కాగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి.ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయనే సంగతి తెలిసిందే.
అయితే డైరెక్టర్ల విషయంలో బాలయ్య చిరంజీవిని ఫాలో అవుతున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చిరంజీవి బాబీ కాంబినేషన్ లో వాల్తేరు వీరయ్య తెరకెక్కగా ఈ సినిమా తర్వాత బాబీ బాలయ్య కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది.ప్రస్తుతం చిరంజీవి మల్లిడి వశిష్ట డైరెక్షన్ లో నటిస్తున్నారు.
అయితే బాలయ్య త్వరలో మల్లిడి వశిష్ట డైరెక్షన్ లో కూడా ఒక సినిమాలో నటిస్తున్నారు.డైరెక్టర్ల విషయంలో చిరంజీవి బాలయ్యను ఫాలో అవుతున్నారని కామెంట్లు వినిపించాయి.చిరంజీవి, బాలయ్య కాంబో మల్టీస్టారర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో మరో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది.చిరంజీవి, బాలయ్య పారితోషికాలు భారీ రేంజ్ లో ఉన్నాయి.
చిరంజీవి 50 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటుండగా బాలయ్య 30 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.బాలయ్య ( Balakrishna )నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటుండగా బాలయ్య భవిష్యత్తు సినిమాలు సైతం భారీ లెవెల్ లో విజయాలను అందుకుంటాయేమో చూడాలి.
బాలయ్య ఇతర భాషలపై కూడా దృష్టి పెడితే బాగుంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.బాలయ్య ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు విడుదలయ్యే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది.