వైఎస్ షర్మిలపై ఏపీ సీఎం జగన్ పరోక్ష సెటైర్లు..!!

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( YS Sharmila )పై సీఎం జగన్ పరోక్షంగా విమర్శలు చేశారు. అనంతపురం( Anantapur ) జిల్లాలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా నిధులు విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

 Ap Cm Jagan Indirect Satires On Ys Sharmila, Ys Sharmila , Chandrababu Naidu , C-TeluguStop.com

రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం, చంద్రబాబు( Chandrababu )ను జాకీ పెట్టి ఎత్తేందుకు మరి కొంతమంది స్టార్ క్యాంపెయినర్లు ప్రయత్నిస్తున్నారని సీఎం జగన్( CM Jagan ) అన్నారు.అలాగే చంద్రబాబు ప్రయోజనాల కోసం బీజేపీలో తలదాచుకున్న పసుపు కమలాలు కూడా స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారని చెప్పారు.ఏ మంచి చేయకుండా కేవలం మోసాలే చేసిన చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారన్నారు.చంద్రబాబును భుజాన వేసుకుని తిరిగే ముఠానే ఈ స్టార్ క్యాంపెయినర్లని విమర్శించారు.

జెండాలు జతకట్టడమే వాళ్ల ఎజెండా అన్న సీఎం జగన్ జనాల గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా అని స్పష్టం చేశారు.అలాగే జనమే తనకు స్టార్ క్యాంపెయినర్లని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube