వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో పేదలు సగానికి తగ్గిపోయారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి(Vjayasai reddy ) సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం రాజకీయంగా సంచలనంగా మారింది.ఏపీలో వైసిపి( YCP ) ప్రభుత్వం ఏర్పడిన తర్వాత , సీఎం జగన్( CM Jagan) సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేయడం, నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే సొమ్ములు జమ చేయడం కారణంగానే ఇదంతా జరిగినట్లుగా విజయసాయిరెడ్డి చెబుతున్నారు .
తాజాగా సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రభావం పేదరికం పై ఏ విధంగా ఉంది అనే అంశంపై విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.దీంట్లో వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు( scheems ) పూర్తిగా సత్ఫలితాన్ని ఇస్తున్నాయని , ఏపీలో పేదలు సగానికి తగ్గిపోయారని విజయసాయి వెల్లడించారు.
![Telugu Ap, Chandrababu, Cog, Vijayasaieeddy, Ysrcp, Ysrcp Mp-Politics Telugu Ap, Chandrababu, Cog, Vijayasaieeddy, Ysrcp, Ysrcp Mp-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/07/andhra-pradesh-has-the-poor-in-ap-reduced-by-half-with-jagans-schemes-ysrcp-mp-vijayasai-reddy-detailss.jpg)
ఏపీలోనూ గత ఐదేళ్లలో పేదరికం సగానికి తగ్గిపోయిందని విజయ సాయి రెడ్డి పేర్కొనడంతో వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై చర్చ మొదలైంది.ఆ రిపోర్టును కూడా ప్రస్తావించారు.నీతి అయోగ్ ఏపీకి ఇచ్చిన 10% లోపు పేదరికం టార్గెట్ ను తాము అధిగమించామని, ఇప్పుడు ఏపీలో కేవలం 6.06% పేదలు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు.” సీఎం(CM ) గారి సంక్షేమ పథకాలు ఫలితాన్ని ఇస్తున్నాయి.ఐదేళ్లలో ఏపీలో సగం తగ్గిన పేదలు -11.77 నుంచి 6.06 శాతానికి తగ్గుదల.నీతి అయోగ్ (Niti Aayog) నిర్దేశించిన 10 శాతం లోపు టార్గెట్ చేరిన ఆంధ్ర( Andhra ).పెత్తందారుల ఆగడాలు రాష్ట్రంలో సాగవు.” అంటూ విజయ సాయి రెడ్డి ట్విట్ చేశారు.
![Telugu Ap, Chandrababu, Cog, Vijayasaieeddy, Ysrcp, Ysrcp Mp-Politics Telugu Ap, Chandrababu, Cog, Vijayasaieeddy, Ysrcp, Ysrcp Mp-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/07/andhra-pradesh-has-the-poor-in-ap-reduced-by-half-with-jagans-schemes-ysrcp-mp-vijayasai-reddy-detailsa.jpg)
దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా, జగన్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు.అప్పులు చేయడమో, ఇతర పథకాలకు సంబంధించిన నిధులను మళ్లించో సంక్షేమ పథకాలకు ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటున్నారు.
దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా, పట్టించుకోనట్టుగానే ముందుకు వెళ్తున్నారు.