టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ త్రిష పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే.తన అందంతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.టాలీవుడ్ లో త్రిషకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉండగా వయసుకు తగ్గ పాత్రలో నటిస్తుంది.ఇదిలా ఉంటే త్రిష ప్రత్యేక పూజలు చేస్తూ బాగా బిజీగా ఉంది.
2003లో నీ మనసు నాకు తెలుసు అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.కానీ ఈ సినిమా తనకు అంత సక్సెస్ ఇవ్వకపోగా.
ప్రభాస్ నటించిన వర్షం సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి సక్సెస్ అందుకుంది.ఇక ఈ సినిమా తర్వాత వెనుతిరిగి చూడకుండా ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుని తెగ దూసుకెళ్లింది.
ఇక మధ్యలో కొన్ని ఫ్లాప్ లు కూడా ఎదుర్కొంది.టాలీవుడ్ లో నాయకి అనే సినిమాలో చివరిసారిగా నటించగా.
మళ్లీ రీ ఎంట్రీ తో వరుస సినిమాలో నటిస్తుంది.
ఇదంతా పక్కన పెడితే గత కొన్ని రోజుల నుండి త్రిష పెళ్లి గురించి తెగ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.గతంలో ఈమె ఓ బిజినెస్ మాన్ ను నిశ్చితార్థం చేసుకోగా.కరెక్ట్ పెళ్లి సమయంలో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.
ఇక ఈ మధ్య ఓ తమిళ స్టార్ డైరెక్టర్ తో ప్రేమలో ఉన్నట్లు.అంతేకాకుండా త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి.
తాజాగా ఆమె చేస్తున్న పూజలు పెళ్లి కోసమేమో అని నెటిజన్లు అనుకోగా ఇదంతా తన పెళ్లి గురించి కాదని తెలిసింది.
ఆమె చేసే పూజలు.మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘పొన్నియిన్ సెల్వన్‘ సినిమా కోసమని తెలిసింది.ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉండగా.
అక్కడ జరుగుతున్న కొన్ని సన్నివేశాలలో కార్తీ, త్రిష, ప్రకాష్ రాజ్ లు పాల్గొన్నారు.