టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో ఒకరైన నందు ,గీతామాధురి( Nandu ,Geetamadhuri ) ల గురించి మనందరికీ తెలిసిందే.నందు నటుడు కాగా గీతా మాధురి సింగర్ అన్న విషయం కూడా తెలిసిందే.
తెలుగులో ఎన్నో పాటలను పాడి ఫిమేల్ యాంకర్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది గీతామాధురి.నందు కూడా దాదాపుగా 25 రూపాయల సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
కేవలం నటుడిగా మాత్రమే కాకుండా, యాంకర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నందు.ఐపీఎల్ లాంటి ధనాధన్ క్రికెట్ టోర్నమెంట్లలో స్పోర్ట్స్ యాంకర్గానూ తన ట్యాలెంట్ చూపిస్తున్నాడు.
ఇటీవల నందు నటించిన మ్యాన్షన్ 23, వధువు వెబ్ సిరీస్( Mansion 23, vadhuvu web series ) లకు ఓటీటీల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో నందు దంపతులకు పేర్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.అందుకు గల కారణం కూడా లేకపోలేదు.నందు త్వరలో రెండవసారి తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే.భార్య గీతా మాధురి రెండవ బిడ్డకు త్వరలోనే జన్మనివ్వనుంది.ఇటీవల కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆమెకు సీమంతం వేడుకను కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా మరొక గొప్ప పని చేసి తన గొప్ప మనసును చాటుకున్నారు.
ఇంతకీ నందు ఏం చేశాడంటే.శ్రీ విద్యాపీఠంలో అన్నపూర్ణార్చన( Annapurnarchana at Sri Vidyapeeth ) చేసిన నందు.800 మందికి ఆహారాన్ని అందించారు.తానే స్వయంగా ఫుడ్ ప్రిపేర్ చేశాడు.అందరికీ వడ్డించాడు.అన్నదానం తర్వాత కూడా పాత్రలు కూడా కడిగాడు.యాక్టర్ అన్న ట్యాగ్ ను పక్కన పెట్టి ప్రతి పనిలోనూ చేయి అందించాడు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.