పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను నెల్లూరు వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి( Nellore YCP MP Adala Prabhakara Reddy ) ఖండించారు.తాను పార్టీ మారే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
కొందరు కుట్రపూరితంగా పార్టీ మారుతానని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.చంద్రబాబును కలవలేదని వెల్లడించారు.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి( Vemireddy Prabhakar Reddy ) తీవ్ర అసంతృప్తిగా ఉన్నారన్న ఆయన వేమిరెడ్డిని ఒప్పించేందుకు ప్రయత్నించానని తెలిపారు.అలాగే మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీలోనే ఉంటారని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచే పోటీ చేస్తానన్నారు.అయితే ఎక్కడి నుంచి పోటీ చేయాలో సీఎం జగన్( CM YS Jagan ) నిర్ణయిస్తారని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే త్వరలోనే సీఎం జగన్ ను కలుస్తానని తెలిపారు.