తెలంగాణలో రానున్న ఎన్నికలకు సీపీఐ, సీపీఎం పార్టీలు ఉమ్మడిగా వెళ్తున్నాయని సీపీఐ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు తెలిపారు.రాజకీయాల్లో మోసం చేసే వాళ్లు ఉన్నంత కాలం మోసపోతూనే ఉంటామని చెప్పారు.
అదేవిధంగా పొత్తుల కోసం తాము ఎప్పుడూ వెంపర్లాడలేదని తెలిపారు.కేసీఆర్ తన అవసరం కోసం గతంలో తమ మద్ధతు కోరారని పేర్కొన్నారు.
కేసీఆర్ అపాయింట్ మెంట్ అడిగిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు.నిన్న కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాలో వామపక్షాలకు చోటు కల్పించకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు.
ఈ నేపథ్యంలోనే సీపీఐ, సీపీఎం ఉమ్మడిగా బరిలోకి దిగనున్నాయన్న కూనంనేని ఎన్ని సీట్లలో పోటీ చేయాలో త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.