కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బెంగళూరుకు వెళ్లారు.ఈ క్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో ఆయన భేటీ కానున్నారని తెలుస్తోంది.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.అయితే డీకే శివకుమార్ ను అభినందించేందుకే బెంగళూరుకు వెళ్లానని కోమటిరెడ్డి చెబుతున్నట్లు తెలుస్తోంది.
కాగా వెంకట్ రెడ్డి వెంట జనరల్ సెక్రటరీ అనిరుధ్ రెడ్డి కూడా ఉన్నారు.ఇటీవల కొందరు తెలంగాణ నేతలు డీకే శివకుమార్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే.