ఖలిస్తాన్( khalistan ) వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే అధినేత అమృత్పాత్ సింగ్( Amritpal Singh ) వ్యవహారంతో పంజాబ్ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.గడిచిన వారం రోజులుగా ఆయనను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా గాలిస్తున్న సంగతి తెలిసిందే.
కానీ నేటి వరకు అమృత్పాల్ ఆచూకీ మాత్రం తెలియరాలేదు.ఉత్తరాఖండ్లో వున్నాడని, టోల్గేట్ మీదుగా ఆయన కారు వెళ్లిందని ఇలా రకరకాలుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కానీ అమృత్పాల్ మాత్రం చిక్కడం లేదు.భారత్ను వీడి నేపాల్ మీదుగా కెనడా ( Canada ) పారిపోవాలన్నది ఆయన వ్యూహాంగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే దేశ సరిహద్దుల్లో కేంద్రం భద్రతను కట్టుదిట్టం చేసింది.బీఎస్ఎఫ్, సశస్త్ర సీమాబల్, భారత సైన్యం ఎక్కడికక్కడ దిగ్భంధించేశాయి.
ఇదిలావుండగా.అమృత్పాల్కు మద్ధతుగా భారత్తో పాటు పలు దేశాల్లో వున్న ఖలిస్తాన్ అనుకూలవాదులు రంగంలోకి దిగారు.భారతీయ దౌత్య కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని వీరు నిరసనలకు దిగుతున్నారు.ఇప్పటికే యూకే, ఆస్ట్రేలియా, అమెరికా, కెనడాలలో ఖలిస్తాన్ మద్ధతుదారులు చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.
భారత్ హెచ్చరికలతో ఆయా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.భారత దౌత్య కార్యాలయాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశాయి.
తాజాగా కెనడాలోని అంటారియో ప్రావిన్స్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని( Mahatma Gandhi statue ) ఖలిస్తాన్ వాదులు ధ్వంసం చేశారు.హామిల్టన్ పట్టణంలోని సిటీ హాల్లో సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.గాంధీ విగ్రహం 2012 నుంచి ఈ ప్రాంతంలోనే వుంది.ఆరు అడుగుల ఈ విగ్రహాన్ని భారత ప్రభుత్వం బహుమతిగా ఇచ్చింది.గాంధీ విగ్రహంపై గ్రాఫిటీతో ప్రధాని నరేంద్ర మోడీపై విద్వేషపూరిత వ్యాఖ్యలను రాశారు.అనంతరం విగ్రహం పక్కనే ఖలిస్తానీ జెండాను ఎగురవేశారు దుండగులు.
అయితే విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు విగ్రహం వద్ద పిచ్చిరాతలు చెరిపివేసి, శుభ్రం చేశారు.కాగా.
గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనపై స్థానిక భారతీయ కమ్యూనిటీ భగ్గుమంది.