సాధారణంగా కొంతమందికి ప్రతిరోజు పాలలో పంచదార కలుపుకునే తాగే అలవాటు ఉంటుంది.అంతేకాకుండా మరికొంతమంది పాలలో ఇంగువ కూడా కలిపి తాగుతూ ఉంటారు.
ఇలా తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతూ ఉంటారు.ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ సమస్యలు ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
జీర్ణ సంబంధిత వ్యాధులు ఉన్నవారు, కడుపులో ఇన్ఫెక్షన్లు ఉన్నవారికి ఇది వెంటనే ఉపశమనాన్ని కలిగిస్తుంది.అంతేకాకుండా శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు ఈ పాలను తాగితే రక్తపోటు అదుపులో ఉండడమే కాకుండా చెడు పదార్థాలను కూడా తొలగిస్తుంది.
అంతేకాకుండా రక్త ప్రవాహం బాగా జరిగేలా చేస్తుంది.అయితే రక్తాన్ని శుద్ధి చేసి రక్తం చిక్కగా లేకుండా పల్చగా ఉండేలా కూడా చేస్తుంది.ఈ పాలను ఉదయం లేదా రాత్రి సమయంలో తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు ఇంగువ వేసి బాగా కలిపి ఉదయం లేదా రాత్రి పూట తాగాలి.
ఇలా తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అజీర్ణం, కడుపునొప్పి, వాంతులు, ఎక్కిళ్ళు, విచారం, మలబద్దకం ఉంటే అన్ని రకాల సమస్యలు దూరం అవుతాయి.ప్రేగు కదలికలు బాగా జరిగి కడుపునొప్పి, గుండెల్లో మంట వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.అంతేకాకుండా కాలేయాలకు ఎటువంటి సమస్య లేకుండా చురుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది.
శ్వాసకోశ వ్యాధులు మరియు గొంతుకు సంబంధించిన సమస్యలను కూడా తగ్గిస్తుంది.పైల్ సమస్య ఉన్నప్పుడు ఈ పాలను తాగితే నొప్పి తగ్గి ఉపశమనం కలుగుతుంది.

చాలామందికి ఎక్కిళ్ళు వచ్చి మంచి నీరు తాగిన చాలా సేపటి వరకు తగ్గకపోతే మాత్రం గోరువెచ్చని పాలలో చిటికెడు ఇంగువ కలిపి తాగితే ఎక్కిళ్ళు క్షణాల్లో తగ్గిపోతాయి.యాంటీ ఆక్సిడెంట్ మరియు ఫినాలేక్ సమ్మేళనాలు ఉండటం వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది.దానివల్ల మన శరీరానికి ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా దూరం రక్షించుకోవచ్చు.







