ఏలూరు జిల్లా విజయరాయిలో ఇదేం కర్మ కార్యక్రమాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాబాయ్ ని చంపినంత సులువుగా నన్నూ చంపొచ్చనుకుంటున్నారని అన్నారు.ఇప్పుడు లోకేశ్ ని లక్ష్యంగా చేసుకున్నారట అని ఆరోపించారు.
వైసీపీ నేతల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు.బాబాయ్ ను చంపిన వారు రాష్ట్రాన్ని పాలించడం ఏం కర్మోనని పేర్కొన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ అవ్వడం చెంపదెబ్బని వెల్లడించారు.జగన్ కు ఇదే ఆఖరి అవకాశమని వ్యాఖ్యనించారు.