వైఎస్ వివేకా హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ అయింది.ఈ కేసును ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని వివేకా కుమార్తె సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై జరిపిన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

 Ys Viveka Murder Case Transfer To Telangana-TeluguStop.com

హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం వెల్లడించింది.

ఈ క్రమంలో కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

హత్య కేసులో సాక్ష్యాధారాలు ధ్వంసం చేసినట్టు ఆధారాలున్నాయని తెలిపింది.విచారణపై వివేకా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని పేర్కొంది.

వివేకా కుటుంబ సభ్యుల ప్రాథమిక హక్కులకు భంగం కలగకూడదని స్పష్టం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube