మాటల మాంత్రికుడు త్రివిక్రం అల వైకుంఠపురములో తర్వాత తన డైరక్షన్ లో సినిమాకు కొద్దిగా గ్యాప్ తీసుకున్నాడు.రీసెంట్ గా మహేష్ తో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లిన త్రివిక్రం ఆ సినిమా తర్వాత మరోసారి అల వైకుంఠపురములో కాంబోని సెట్ చేస్తున్నారట.
అసలైతే మధ్యలో ఎన్.టి.ఆర్ తో సినిమా చేయాల్సి ఉన్నా బన్నీ తో సినిమాకే ఆసక్తి చూపిస్తున్నాడట త్రివిక్రం.ఇప్పటికే అల్లు అర్జున్ కోసం ఒక కథ రెడీ చేసి వినిపించాడట.
త్రివిక్రం తో సినిమా అంటే అల్లు అర్జున్ ఎప్పుడూ రెడీ అని చెప్పేశాడట.పుష్ప తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోగా త్రివిక్రం కూడా ఈసారి పాన్ ఇండియా కథతోనే బన్నీని కలిశాడట.
మహేస్ సినిమా పూర్తి చేశాక త్రివిక్రం.పుష్ప 2 పూర్తి చేసి బన్నీ ఇద్దరు కలిసి సినిమా చేస్తారని తెలుస్తుంది.
జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో 3 సినిమాలు ఒక దానికి మించి ఒకటి హిట్ అందుకున్న అల్లు అర్జున్ నాల్గవ సినిమా ఎలాంటి ప్రాజెక్ట్ తో వస్తారో చూడాలి. పుష్ప ది రైజ్ తో నేషనల్ వైడ్ గా దుమ్ముదులిపేసిన బన్నీ పుష్ప 2 తో అంతకుమించి హిట్ అందుకుంటాడని అంటున్నారు.