సికింద్రాబాద్ రూబీ హోటల్ లో అగ్నిప్రమాదం జరిగిన స్థలాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు.అధికారుల నుంచి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోవడం దురదృష్టకరమని కిషన్ రెడ్డి అన్నారు.గతంలో కూడా హైదరాబాద్ లో ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరిగాయన్న ఆయన.
ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలన్నారు.
వెహికిల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో లోపం ఉంటే ఎలక్ట్రికల్ వెహికిల్ కంపెనీపై కేసు పెట్టాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ బిల్లు వసూలు చేయడానికే రాకూడదని.ఇలాంటి కాంప్లెక్స్, అపార్టుమెంట్లలో తనిఖీలు చేయాలని సూచించారు.
అనంతరం కేంద్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయాలైన వారికి 50 వేలు ప్రకటించారు.