ఇది నిజంగా క్రికెట్ అభిమానులకు పండగ లాంటి వార్త.నిన్న ఆదివారం దుబాయ్ లో జరిగిన ICC సమావేశంలో T20 వరల్డ్ కప్ సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2024కి 12 జట్లు అర్హత సాధిస్తాయని ఈ సందర్భంగా చెప్పారు.ఇందులో వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ తో పాటు ఆస్ట్రేలియాలో జరిగే T20 వరల్డ్ కప్ 2022లో మొదటి 8 జట్లను ఎంపిక చేయనున్నారు.
అలాగే, 14 నవంబర్ 2022న విడుదల కానున్న ICC T20 ర్యంకింగ్ లో అత్యధిక ర్యాంక్ ఉన్న జట్లు కూడా ఈ లీగ్ లో ఆడనున్నాయి.
దీనివలన స్పష్టమయేదేమంటే, ఇక్కడ 8 జట్లు పెద్ద జట్లు కాగా, 2 జట్లు వెస్టిండీస్, అమెరికా ప్రపంచ కప్ ఆడనున్నాయి.
మిగతా 2 జట్లను ICC T 20 ర్యాంకింగ్స్ నుంచి ఎంపిక చేస్తారు.ఈ విధంగా మొత్తం 12 జట్లు T20 ప్రపంచకప్ 2022కి బరిలో దిగబోతున్నాయి.
ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ప్రపంచకప్లో వెస్టిండీస్ తొలి 8 స్థానాల్లో చేరితే.ర్యాంకింగ్ ఆధారంగా 3 జట్లను, టాప్ 8వ ర్యాంక్ నుంచి బయట పడితే మరో 2 జట్లు మాత్రమే ర్యాంకింగ్స్ నుంచి అర్హత సాధిస్తాయి.
ICCలో BCCI సెక్రటరీ జైషాకు పెద్ద పీట వేశారు.ICC పురుషుల క్రికెట్ కమిటీలో మెంబర్ బోర్డు ప్రతినిధిగా నియమితుడయ్యారు.ఆదివారం జరిగిన ICC త్రైమాసిక సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.ICC (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) బోర్డు ఆదివారం తన ఛైర్మన్ గ్రెగ్ బారీని అక్టోబర్ చివరి నాటికి తన పదవీకాలాన్ని పూర్తి చేయడానికి సిద్ధం చేసింది.
కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ప్రపంచ సంస్థకు పూర్తి సమయం ఇచ్చింది.దానిలో భారత క్రికెట్ బోర్డు కీలక పాత్ర పోషిస్తుంది.