జై భీమ్ తో సూపర్ హిట్ అందుకున్న సూర్య తన నెక్స్ట్ సినిమా ఈటీని కూడా సౌత్ అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.పాండిరాజ్ డైరక్షన్ లో సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
సినిమాలో సూర్యకి జోడీగా ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇమ్మాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 4న రిలీజ్ ఫిక్స్ చేశారు.
లేటెస్ట్ గా సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.
సూర్య ఈటీ సినిమా సెన్సార్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నట్టు కోలీవుడ్ టాక్.
యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో సూర్య లుక్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.జై భీమ్ తో నేషనల్ వైడ్ గా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సూర్య ఈసారి ఈటీతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నారు.
కమర్షియల్ యాంగిల్ తో కాకుండా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో వస్తున్న సూర్య ఈటీ సినిమాని కూడా అదే తరహాలో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.కోలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ప్రియాంకా అరుల్ మోహనన్ సూర్య సినిమాతో స్టార్ స్టేటస్ అందుకోవాలని చూస్తుంది.