మన దేశం వ్యాప్తంగా చాలా మంది ప్రజలు లక్ష్మీదేవిని ఎంతో భక్తితో ప్రతిరోజు పూజిస్తూ ఉంటారు.అందుకోసం వారి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని లక్ష్మీదేవిని తమ ఇంట్లోకి ఆహ్వానించాలని పూజ చేస్తూ ఉంటారు.
అంతేకాకుండా ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి వారి ఇంట్లోకి వస్తుందని చాలామంది ప్రజల నమ్మకం.వారంలో మిగతా రోజుల కంటే శుక్రవారం రోజు వెంటనే పరిశుభ్రంగా ఉంచుకోమని చెబుతూ ఉంటారు.
ఈ విధంగా చేయడం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం.మన దేశంలో ఉండే పల్లెలలో ప్రతి ఇంట్లో దాదాపు ఉండే పెరటి లో అరటి చెట్టు, తులసి మొక్క రెండు ఉంటాయి.
ఈ విధంగా ఉంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని చాలా మంది ప్రజలు ఇంటిలోని పెరట్లో పెంచుకుంటూ ఉంటారు.డబ్బు వచ్చేముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.
ఇంట్లో చీమలు ఉంటే చీమల మందు వేసి మరి వాటిని చంపేస్తూ ఉంటాం.కానీ ఇంట్లో నల్ల చీమలు వస్తూ ఉంటే మంచిదని శాస్త్రం చెబుతోంది.
నోటితో బియ్యం ధాన్యాలు ఉన్న నల్ల చీమలు తిరిగితే కూడా మంచిదే అని చెబుతారు.ఇంట్లో రెండు తలల పాము కనిపిస్తే శుభం జరుగుతుందని కూడా చాలామంది నమ్ముతారు.
లక్ష్మీదేవి ఆ ఇంటిలోకి వచ్చేటప్పుడు ఆ కుటుంబ సభ్యులలో ఈర్ష, అసూయ లాంటివి తగ్గిపోతాయి.కుటుంబంలో ఉన్న ఒకళ్ళ మీద ఇంకొకరికి ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి.శరీరంపై బల్లి కొన్నిచోట్ల పడితే మాత్రం శుభం జరుగుతుంది అని శాస్త్రం చెబుతోంది.శాస్త్రం ప్రకారం కుడి చేతిపై బల్లి పడి వెంట వెంటనే పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే మీరు త్వరలో బాగా సంపాదించే అవకాశం ఉంది.
ఉదయం పూట ఆగ్నేయ దిశ నుంచి కోకిల కుత వినిపిస్తే నష్టం జరిగే అవకాశం కూడా ఉంది.అదే సాయంత్రం పూట వినిపిస్తే శుభం జరుగుతుంది అని చాలామంది ప్రజలు నమ్ముతారు.
LATEST NEWS - TELUGU