ఈ మధ్య జనాల తీరు చూస్తుంటే నిజంగానే ఆశ్చర్యం వేస్తోంది.ఎందుకంటే మారుతున్న ట్రెండ్ను వారు అత్యంత దారుణంగా వాడేస్తున్నారు.
అందరూ చేసినట్టు చేస్తే కిక్ ఏముంటుందని అనుకుంటున్నారో ఏమో తెలయట్లేదు గానీ.చాలామంది ఆలోచిస్తున్న తీరు కొన్ని సార్లు వివాదాస్పదం అవుతోంది.
ఇక పెండ్లి విషయానికి వస్తే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి.ముఖ్యంగా పెండ్లి అంటే ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది చాలా కామన్ అయి పోయింది.
కాగా ఈ వెడ్డింగ్ షూట్స్ అనేవి చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఎందుకంటే ఎప్పటికైనా తమకు గుర్తుండి పోయేలా ఉండాలని ఇలా ప్లాన్ చేసుకుంటున్నారు చాలామంది.
కాగా ఇలాంటి వెడ్డింగ్ షూట్లే చివరకు వివాదాస్పదంగా మారుతున్నాయి.మొన్నటికి మొన్న ఓ జంట ఇలాగే బురద గుంత పక్కన వెడ్డింగ్ షూట్ చేసుకోగా.
అది కాస్తా ఇబ్బందుల్లో పడేసింది.వారిద్దరూ కూడా అందులో పడిపోయారు.
అయితే థాయ్ లాండ్కు చెందిన ఓ జంట ఇప్పుడు ఇలాంటి పనే చేసారు.అందరూ చేసినట్టు కాకుండా ఏకంగా శ్మశానంలోనే వెడ్డింగ్ షూట్ను ప్లాన్ చేసుకుంది.
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజమండి బాబు.
కాగా ఆ జంట శవాల లాగా మారిపోయారు.బ్రతికి ఉండగానే శవపేటికలో పడుకుని శవాల మాదిరిగా ఫోజులు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.ఇక శవాల్లాగా యాక్ట్ చేస్తూ.
ఒకిరి మీద ఒకరు పూలు కూడా చల్లుకున్నారు.ప్రతి ఫొటోలో కూడా తమను తాము చనిపోయిన శవాల్లాగా చూపించుకున్నారు.
అంటే చనిపోయినా కూడా తాము ఒక్కటిగానే జీవిస్తామని వారు చెప్పాలనుకున్నారు.ఇక ఈ ఫొటోలు నెట్టిట్లో తెగ వైరల్ కావడంతో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
ఇదేం సరదారా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇదేం తీరు మీది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.