కన్నడ పవర్ స్టార్ పునీత్ శుక్రవారం ఉదయం జిమ్ చేస్తూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు.ఈ క్రమంలోనే ఆయన కుటుంబ సభ్యులు అతనిని బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్ కు తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తూ అతనిని కాపాడాలని శతవిధాల ప్రయత్నాలు చేశారు అయితే అప్పటికే చాలా ఆలస్యం కావడంతో పవర్ స్టార్ పునీత్ ఈ లోకాన్ని వదిలి వెళ్లారని వైద్యబృందం అధికారికంగా ప్రకటించారు.
ఇలా ఒక్కసారిగా పునీత్ మరణవార్త తెలియజేయడంతో సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది.ఈ విషయాన్ని సినీ నటులు అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ క్రమంలోనే ఆయన మృతి చెందారన్న వార్త తెలుసుకున్న సినీ నటులు అతనికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తన ఆత్మ శాంతించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.
ఈ క్రమంలోనే తెలుగులో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మోనిత అలియాస్ శోభా శెట్టి పునీత్ రాజ్ కుమార్ మరణంపై స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.
ఈ సందర్భంగా శోభా శెట్టి మాట్లాడుతూ ఇది నమ్మలేకపోతున్నాను.చాలా త్వరగా వెళ్ళిపోయావు అన్నా.ఇది చాలా అన్యాయం.దేవుడు కూడా ఒక్కోసారి ఎంతో క్రూరుడిగా కనిపిస్తాడు.
ఎంతో మిస్ అవుతున్నాను అంటూ ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా పునీత్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే శోభ శెట్టి నటుడు పునీత్ తో కలిసి దిగినటువంటి ఫోటోను షేర్ చేస్తూ అతని మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.ఇక కన్నడ పవర్ స్టార్ మరణవార్త తెలియగానే కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రం మొత్తం విధించింది.అలాగే ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ రెండు రోజులపాటు కర్ణాటక మొత్తం థియేటర్లు బంద్ చేశారు.
పవర్ స్టార్ మరణించాడన్న వార్త తెలియడంతో ఇతర ప్రదేశాలకు షూటింగ్ వెళ్లిన కన్నడ చిత్ర బృందం షూటింగ్ లకు ప్యాకప్ చెప్పి తిరిగి కర్ణాటక చేరుకున్నారు.