వైయస్ రాజశేఖర్ రెడ్డి వృత్తిగత సహాయకుడిగా ఆయన నమ్మిన బంటుగా సూరీడు అనే వ్యక్తికి ఎంతో గుర్తింపు ఉన్నది.రాజశేఖర్ రెడ్డి ఎక్కడ ఎలాంటి కార్యక్రమంలో ఉన్న ఆయన వెంటే సూరీడు ఉండేవాళ్ళు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ టైం లో ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి, ఎటువంటి ఆహారం వర్ణించాలి అనేది మొత్తం సూరీడే చూసుకునేవాడు.కానీ ఎప్పుడైతే వైయస్సార్ మరణించడం జరిగిందో సూరీడు మీడియా ముందు గాని, మరే చోట గాని ఆయన కనబడలేదు.
దీంతో ఆయనపై అనేక రకాల ఆరోపణలు విమర్శలు అప్పట్లో వచ్చాయి.పరిస్థితి ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా రావిరాలలో నిర్వహించిన రాజీవ్ రైతు రణభేరి సభలో సూరీడు రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ముగింపు సభలో ఇప్పుడు కనపడటం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా సభకు హాజరయి రేవంత్ రెడ్డి తో ఫోటో దిగి అక్కడ ఉన్న కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలతో సూరీడు పలక రించడం జరిగింది.
.