అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.మొదటి సినిమాతోనే ఒక్కసారిగా ఇండస్ట్రీలో అందరిని అలెర్ట్ చేసి తన బ్రాండ్ ఏంటో పరిచయం చేసిన సందీప్ రెడ్డి సెకండ్ సినిమా కోసం చాలా మంది టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ అడ్వాన్స్ లు కూడా ఇచ్చారు.
అయితే అర్జున్ రెడ్డిని హిందీలో రీమేక్ చేసే అవకాశం రావడంతో బాలీవుడ్ లోకి వెళ్ళాడు.అక్కడ అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్ గా రీమేక్ చేసి గ్రాండ్ విక్టరీ కొట్టాడు.
ఆ సినిమా ఏకంగా రెండు వందల కోట్లు కలెక్ట్ చేసింది.సాహిద్ కపూర్ కెరియర్ లో అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది.
ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో టి-సిరీస్ లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్ తో నెక్స్ట్ సినిమాని చేసే అవకాశం సందీప్ రెడ్డి సొంతం చేసుకున్నాడు.ఇక వెంటనే రణబీర్ కపూర్ తో సినిమా కూడా కన్ఫర్మ్ చేసుకున్నాడు.
ఎందుకనో కొంతకాలం ఈ సినిమాకి గ్యాప్ వచ్చింది.ఈ లోపు తెలుగు వైపు మళ్ళీ దృష్టిపెట్టి ఇక్కడ హీరోలని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు.
అయితే స్టార్ హీరోలు అందరూ ఇప్పటికే ప్రాజెక్ట్ లతో కమిట్ అయ్యి ఉండటం.నెక్స్ట్ సినిమాలకి కూడా దర్శకులని ఫిక్స్ చేసేసుకోవడం జరిగింది.ఈ కారణంగా సందీప్ రెడ్డికి స్టార్ హీరోల డేట్స్ దొరకలేదు.ఇంతలో లాక్ డౌన్ వచ్చేసింది.
మరల ఇప్పుడు బాలీవుడ్ లోనే తన నెక్స్ట్ సినిమాని సందీప్ ప్లాన్ చేసుకుంటున్నారు. రణబీర్ కపూర్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రెడీ అయ్యాడు.
అతని నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసేశాడు.ఈ సినిమాకి ఆనిమల్ అనే టైటిల్ ని కూడా కన్ఫర్మ్ చేశారు.
డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కబోయే ఈ సినిమాలో రణబీర్ కపూర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది.