కరోనా వైరస్ పుణ్యమా అని చాలా కంపెనీల్లో కొత్త కొత్త మార్పులు మొదలయ్యాయి.ఎప్పుడూ పాటించని విధంగా కోవిడ్ 19 నేపథ్యంలో ప్రతి అంశంలోనూ శుభ్రతను పాటిస్తున్నాయి కంపెనీలు.
అంతేకాకుండా ప్రజలు బయటికి రాకపోవడంతో మరికొన్ని కంపెనీలు ఇంటివద్దకే వారి ప్రోడక్ట్ సంబంధించి వివరాలను తెలుపుతూ వాటిని టెస్ట్ డెమో లను నిర్వహిస్తున్నారు.
ముఖ్యంగా కొంత మంది ప్రజలు అసలు ఇంటినుండి బయటికి రావడానికి భయపడుతున్న సమయంలో కొన్ని వ్యాపార సంస్థలు విభిన్నమైన ఏర్పాట్లను తీసుకు వస్తున్నాయి.
ఇలాంటిదే ఇప్పుడు సాంసంగ్ చేస్తోంది.కంపెనీకి సంబంధించిన ఫోన్ ల విషయంలో ఈ ఏర్పాటును అందించబడుతుంది.
సాంసంగ్ కొత్తగా ఎక్స్పీరియన్స్ ‘ సాంసంగ్ అట్ హోమ్ ‘ అనే సరికొత్త విధానాన్ని భారతీయులకు దగ్గర చేసింది.ఇకపోతే ఇందులో మీకు సాంసంగ్ కంపెనీ నుండి ఎలాంటి మోడల్ ఫోన్ అయినా సరే దానిని ఎంపిక చేసుకొని వాటిని మీ ఇంటి వద్దకే తెప్పించుకొని టెస్ట్ చేసి కొనవచ్చు.
అది కూడా మీకు నచ్చితే కొనవచ్చు లేకపోతే ఎటువంటి అభ్యంతరం లేదు.ఇందుకోసం వినియోగదారులు సాంసంగ్ ఇండియా వెబ్ సైట్ ద్వారా హోమ్ డెమో ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఇలా చేయడం ద్వారా మీకు దగ్గరలో ఉన్న సాంసంగ్ రిటైల్ షోరూం నుండి ఓ ప్రతినిధి మీ ఇంటికి వచ్చి మీరు కోరుకున్న మోడల్ ని మీకు డెమో గా చూపించే అవకాశం కల్పించింది.ఆపై మీకు ఫోను నచ్చితే అక్కడే కొనే అవకాశం కూడా ఉంది.
ఈ ఆప్షన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉండే అన్ని సాంసంగ్ రిటైల్ స్టోర్ లలో ఈ సదుపాయం లభించనుంది.అయితే సాంసంగ్ సంబంధించిన ప్రతినిధి మీ ఇంటికి వచ్చిన సమయంలో వారు ఖచ్చితంగా సామాజిక దూరం పాటించి తగు జాగ్రత్తలు తీసుకుంటారని సంస్థ చెప్పుకొచ్చింది.