సుశాంత్ సింగ్ రాజ్పుత్.డెత్ మిస్టరీ ప్రస్తుతం ఎంత ఆసక్తిరేపుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తవ్వే కొద్ది ఈ కేసులో నిజాలు బయటకు వస్తున్నాయి.ఇంకా సుశాంత్ కేసు దర్యాప్తులో భాగంగానే రియా చక్రవర్తి నిన్న శుక్రవారం ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యింది.
ఈ విచారణకు రియా చక్రవర్తి సోదరుడు షాయిక్ చక్రవర్తితో కలిసి ఈడీ కార్యాలయానికి వచ్చారు.అయితే వారు అత్యంత ఖరీదైన ఫోర్డ్ ఎడీవోర్లో కారులో వెళ్లి హాజరయ్యారు.
దీంతో రియా చక్రవర్తికి అంత ఖరీదైన లగ్జరీ కారు ఎక్కడి నుండి వచ్చిందనే దానిపై ఎన్నో ప్రశ్నలు పుట్టాయి.అయితే ఆ కారు రియా చక్రవర్తిది కాదు అని సమాచారం.
ఆ కారు ముంబైకి చెందిన ప్రముఖ స్టార్ హోటల్స్ వ్యవస్థాపకుడు సువేద్ లోహియాది ఆ కారు అని సమాచారం.ఇంకా ఇతను బాలీవుడ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో మెరుస్తుంటాడు.2014లో సల్మాన్ ఖాన్ చిత్రంలో ఒకసారి, అభిషేక్ కపూర్ సినిమాలో ఒకసారి నటించాడు.సినిమాల్లో ఎంత చిన్న పాత్రలో నటించిన సువేద్ వివిధ కార్యక్రమాల్లో నటీనటులతో కలిసి తీసుకున్న ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు.
అంతేకాదు సువేద్ సుశాంత్ కు మంచి స్నేహితుడు.సుశాంత్ చనిపోయిన నెల రోజులకు ఒక మంచి స్నేహితుడును కోల్పోయ అంటూ భావోద్వేగ పోస్టును సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
అలాంటి సువేద్ కారులో రియా చక్రవర్తి ఎలా వచ్చింది? రియా చక్రవర్తికి సువేద్ కి సంబంధం ఏంటి అనే ఆలోచనలో పడ్డారు అభిమానులు.