తెలుగు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర మంత్రి భేటీ..!

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతోంది.జల వివాద పరిష్కారం కోసం ఆగస్టు 5వ తేదీన అత్యున్నత మండలి సమావేశం కానుంది.

 Union Minister Gajendra Singh Shekavath, Telangana Cm Kcr, Ap Cm Jagan, Water Wa-TeluguStop.com

ఈ అత్యున్నత మండలి సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పాల్గొననున్నారు.ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ భేటీ కానున్నారు.

రెండు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదుతో అఫెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ సమావేశంలో కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన అంశాలపై రెండు రాష్ట్రాలకు ఉన్న అభ్యంతరాలపై చర్చలు జరగనున్నాయి.

అఫెక్స్ కౌన్సిల్ లో చర్చించనున్న ఈ సమావేశం ఇరు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.దీంతో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న జల వివాదాలపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube