టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ఇటీవలే తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా “శిఖరాన్ని చూసి కుక్కలు ఎంత మొరిగి నా శిఖరం తమవైపు తల తిప్పి చూడదంటూ టాలీవుడ్ పవర్ స్టార్ మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫోటో ని ట్యాగ్ చేసి ట్వీట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
అంతేగాక కొంతమంది నెటిజనులు ఈ ట్వీట్ ని నిఖిల్ టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ దర్శకుడిని ఉద్దేశించి చేశాడని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అయితే తాజాగా టాలీవుడ్ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ప్రముఖ వార్తా ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని ఈ విషయంపై స్పందించాడు.
ఇందులో భాగంగా ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఇటీవలే టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన అధికారిక ఖాతా ద్వారా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి శిఖరాన్ని చూసి కుక్కలు ఎంత మరిగిన ప్రయోజనం ఉండదు అంటూ ట్వీట్ చేశాడని దీనిపై మీ స్పందన ఏమిటని అడిగింది.దీంతో రామ్ గోపాల్ వర్మ అసలు తనకి నిఖిల్ సిద్ధార్థ్ అంటే ఎవరో తెలియదని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.
అంతేగాక ఇలాంటి వాళ్ల అందరూ పవన్ కళ్యాణ్ మెప్పు పొందడం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని అన్నాడు.దీంతో కొంత మంది నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా పని చేసినటువంటి ఓ సీనియర్ దర్శకుడికి యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి తెలియకపోవడం ఏమిటో విడ్డూరం కాకపోతే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ “పవర్ స్టార్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని కూడా విడుదల చేసి ఈ చిత్రంపై అంచనాలు అమాంతం పెంచేశాడు.
అయితే ఈ చిత్రాన్ని ఈ నెల 25వ తారీఖున ఆన్ లైన్ థియేటర్స్ ద్వారా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.అయితే ఈ చిత్రాన్ని చూసేందుకు గాను ముందుగా 150 రూపాయలు చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించాడు.