తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రంగం సిద్ధం చేసిన సంగతి అందరికీ తెలిసిందే.క్యాబినెట్ వస్తాను అవకాశం కోసం నిన్న గవర్నర్ నరసింహన్ ని కలిసి కేబినెట్ విస్తరణ ఈ అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది.
గవర్నర్ కూడా పర్మిషన్ ఇవ్వడంతో క్యాబినెట్ విస్తరణ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 19న ముహూర్తం ఫిక్స్ చేశాడు.
ఇదిలా ఉంటే క్యాబినెట్ విస్తరణ కెసిఆర్ చేయడానికి రెడీ కాగానే టిఆర్ఎస్ లో ఆశావహుల సంఖ్య పెరిగింది.
అయితే ముందుగా కేవలం పది మందికి మాత్రమే మంత్రులుగా అవకాశం ఇవ్వాలని భావించిన కెసిఆర్ అదనంగా ఇద్దరిని కలుపుకుని మొత్తం 12 మంది కి మంత్రి పదవులు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.ఇక ఈ 12 మంది క్యాబినెట్ మంత్రులు గా సుమారు ఖరారైనట్లేనని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
వీళ్ళ పదిమందికి స్పష్టంగా మంత్రి పదవులు ఖరారు కాగా, మరో నలుగురుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆప్షన్ గా పెట్టుకొని వారిలో ఇద్దరికి మాత్రమే మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.ఇట్లు తన కుటుంబానికి చెందిన కేటీఆర్ హరీష్ రావుకి మంత్రి పదవులను దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం.