ప్రగతి భవన్లో అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్న కేసీఆర్.వచ్చే ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేశారని తెలంగాణానా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కేసీఆర్ పై మండిపడుతున్నారు.
అయితే కేసీఆర్ అసలు టార్గెట్ రేవంత్ కాదని ఆయన గురువు టీడీపీ అధినేత చంద్రబాబు అని తెలుస్తోంది.తెలంగానంలో తనకు ఎదురే లేదని భావించి ముందస్తు ఎన్నికలకు సిద్ధమైతే .తమ పార్టీని ఓడించడానికి ఎవరూ ఊహించని విధంగా మహాకూటమి ఏర్పాటయిందని కేసీఆర్ గుర్రుగా ఉన్నాడు.అదీ కాకుండా తెలంగాణాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని భావిస్తున్న తరుణంలో టీడీపీ రోజురోజుకూ బలం పెంచుకోవడం కేసీఆర్ కి మింగుడుపడడంలేదని అందుకే ముందు రేవంత్ తరువాత బాబు నా టార్గెట్ అనే విధంగా భయపెట్టాలని కేసీఆర్ చూస్తున్నట్టు అనుమానాలు కలుగులుతున్నాయి.
ఇప్పటికే అనేక విధాలుగా తనను వేధించిన కేసీఆర్.చేతకాక మోదీ సాయంతో ఇప్పుడు కొత్త కుట్రకు తెరలేపాడని రేవంత్ అన్నారు.కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని తెలంగాణలో ప్రచారానికి రాకుండా చంద్రబాబును నిలువరించడానికి.కేసీఆర్, మోదీ కలిసి చేసిన కుట్ర ఇదని ఆరోపించారు రేవంత్.కేసీఆర్ కు చంద్రబాబు భయం పట్టుకోవటంతోనే ఇలా దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు.చంద్ర బాబుకు బినామే అని మాట్లాడే వాళ్లకు బినామీ అన్న పదానికి అర్ధం తెలుసా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి మాటలు చంద్రబాబంటే కేసీఆర్ కు భయం అన్న విషయాన్ని తెలియజేస్తున్నాయి.
అయితే ఈ వేధింపుల వ్యవహారంలో రేవంత్ ఎక్కడా భయపడడంలేదు.కేసీఆర్ ని టార్గెట్ చేసుకుని మాటల తూటాలు వదులుతున్నాడు.ఎవరి ఆస్తులెంతో తేల్చుకుందామని, ఇద్దరి ఆస్తులపై విచారణ కోసం ప్రధాని మోదీకి లేఖ రాద్దామన్నారు.దమ్ముంటే కేసీఆర్ తన సవాల్ ను స్వీకరించాలన్నారు.తనకు అక్రమాస్తులు ఉన్నాయంటున్నవారు నిరూపించాలని సవాల్ విసిరారు రేవంత్రెడ్డి.తన భార్య పుట్టింటికి సంబంధించిన ఆస్తులను కూడా తన ఆస్తులుగా చూపుతూ నీచమైన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక ఈ వేధింపుల వ్యవహారంలో కేసీఆర్ తరువాత టార్గెట్ ఏపీ సీఎం చంద్రబాబు అనే వార్తలు షికారు చేస్తున్నాయి.ఓటుకు నోటు కేసు లో బాబు ని బుక్ చేసేందుకు పగడ్బందీగా వ్యూహరచన చేస్తున్నట్టు విశ్వసనీయంగా అందుతున్న సమాచారం.