ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలో కంటెస్టెంట్లు తన స్కిట్లతో అదరగొడుతుంటే ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న యాంకర్ రష్మి గౌతమ్ మాత్రం తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.అంతేగాక ఈ అమ్మడు ఒకవైపు డీ జోడి ఎక్స్ ట్రా జబర్దస్త్, వంటి షోలలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూనే మరోపక్క సినిమాల్లో కూడా నటిస్తోంది.
గతంలో ఈ అమ్మడు నటించినటువంటి “గుంటూరు టాకీస్” చిత్రం ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తు ఉంటుంది.అయితే తాజాగా ఈ అమ్మడుకి సంబంధించినటువంటి ఓ వీడియో నెట్ లో వైరల్ అవుతుంది.
అయితే ఇందులో రష్మి గౌతమ్ తన ఫ్రెండ్స్ తో కలిసి కారులో ఓ పాటకి డాన్స్ చేస్తూ ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది.అయితే ఇందులో రష్మి గౌతమ్ తో పాటు తన నలుగురు స్నేహితురాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ వీడియో నీ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది.ఈ వీడియో చూసి నటువంటి నెటిజన్లు రష్మి ఫుల్ గా తాగిందని అందుకే తనను తాను మైమరచి డాన్స్ చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే వీరికి రష్మి గౌతమ్ అభిమానులు దీటుగా సమాధానం చెబుతున్నారు.స్నేహితులతో కలిసి సరదాగా కార్ లో డాన్స్ చేస్తే తాగినట్లేనా అంటూ సమాధానం ఇస్తున్నారు.అయినా నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా వీడియోకి ఫ్రెండ్స్ తో తాగి రచ్చ చేస్తున్న రష్మి అని క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో సెలబ్రిటీల పరువు తీయడం సరికాదని అంటున్నారు.
అయితే సోషల్ మీడియాలో రష్మీ గురించి ఇంత జరుగుతున్నప్పటికీ రష్మి గౌతమ్ మాత్రం ఈ వీడియోపై స్పందించడం లేదు.అయితే గతంలో కూడా రష్మి గౌతమ్ పై చాలానే పుకార్లు వచ్చినప్పటికీ అవన్నీ ఆమె లైట్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే మరి ఈ సారి ఈ వీడియోపై రష్మి గౌతమ్ స్పందిస్తుందో లేదో చూడాలి.
అంతేగాక ఈ మధ్యకాలంలో రష్మి గౌతమ్ కి సంబంధించినటువంటి మరో వార్తకూడా హల చల్ చేస్తోంది.అయితే ఇందులో రష్మీ గౌతమ్ తన సొంత జిల్లా అయినటువంటి విశాఖపట్నంలో రష్మీ 100 ఎకరాల భూమిని కొన్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి.
ఏకైతే ఈ వార్తలపై కూడా రష్మీ గౌతమ్ స్పందించలేదు.
.