భువనగిరి నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో మాజీ మంత్రి హరీశ్ రావు( Ex Minister Harish Rao ) భేటీ అయ్యారు.భువనగిరికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Minister Komatireddy Venkat Reddy ) ఏం చేశారని ప్రశ్నించారు.
మన ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించి నల్గొండకు ద్రోహం చేశారని హరీశ్ రావు ఆరోపించారు.గతంలోనూ ఉమ్మడి నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందన్నారు.
బీజేపీ – బీఆర్ఎస్ ఒక్కటేనని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు.
రాష్ట్రంలో బీజేపీ నేతలను ఓడించిందే బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) అని తెలిపారు.బీజేపీని నిలువరించే శక్తి బీఆర్ఎస్ కు మాత్రమే ఉందని చెప్పారు.రాష్ట్రంలో అడుగుపెట్టకుండా అదానీని కేసీఆర్( KCR ) నిలువరించారని తెలిపారు.
కాంగ్రెస్ నేతలు వెళ్లి అదే అదానీతో అగ్రిమెంట్ చేసుకున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ వచ్చి రెండు నెలలు కాకముందే రూ.15 వేల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు.ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు.